నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో చలో హాలియా పేరిట ఈ నెల 14న భారీ ఎన్నికల బహిరంగసభ నిర్వహణకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభకు భారీ ఏర్పాట్లుచేస్తున్నది. సభకు భారీగా జనం తరలివస్తారన్న అంచనాలతో విస్తృత ఏర్పాట్లుచేస్తున్నారు. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎన్నికల ఇంచార్జి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నియోజకవర్గ నేత ఎంసీ కోటిరెడ్డి బుధవారం బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. 14న సభకు పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. సభకు విస్తృత ఏర్పాట్లుచేస్తున్నట్టు తక్కెళ్లపల్లి రవీందర్రావు వివరించారు. ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని, సభకు అదేస్థాయిలో ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
సాగర్ నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లు ఉండగా.. సుమారు 1.53 లక్షల మంది వివిధపథకాల ద్వారా లబ్ధిదారులుగా ఉన్నట్టు అంచనా. వీరిలో మెజార్టీ ప్రజలు టీఆర్ఎస్ ప్రచారంలో కలిసొస్తున్నారు. 14న సభకు పథకాల లబ్ధిదారులంతా స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామం నుంచి కనీసం 60-70% మంది సభకు వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి మరోసారి ఇక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి
అంతర్జాతీయ జర్నల్లో మన పోలీస్ ఆర్టికల్
లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య
మా సర్వీసును క్రమబద్ధీకరించండి