అగర్తలా : కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన 30 మంది యువకులు కొవిడ్ కేర్ సెంటర్ నుంచి పరారీ అయ్యారు. ఈ ఘటన త్రిపురలోని అరుంధతి నగర్లో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. త్రిపుర స్టేట్ రైఫిల్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరైన వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. 65 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 40 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వారందరినీ కొవిడ్ కేర్ సెంటర్కు తరలించారు. ఈ క్రమంలో ఆ సెంటర్ గోడలు బద్దలుగొట్టి 30 మంది పరారీ అయ్యారు. వీరి సెల్ఫోన్ లోకేషన్ ఆధారంగా వారు ఎక్కడున్నారో పోలీసులు శుక్రవారం గుర్తించారు. వీరిని కొవిడ్ సెంటర్కు తరలించే ప్రక్రియలో పోలీసులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..