అహ్మదాబాద్ : గుజరాత్ను భూకంపం వణికించింది. సోమవారం ఉదయం తెల్లవారు జామున 3.37 గంటలకు రిక్టర్ స్కేల్పై 3.8 త్రీవతతో భూమి కంపించదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాజ్కోట్కు దక్షిణాన 182 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో జనం భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే, భూకంపంతో నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం అరుణాచల్ప్రదేశ్లో రిక్టర్ స్కేల్పై 2.6 తీవ్రతతో భూమి కంపించింది. అసోంలోనూ 2.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.