ఏన్కూరు, మార్చి 29: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని వైరా శాసన సభ్యుడు రాములునాయక్ పేర్కొన్నారు. మండలంలోని రంగాపురానికి చెందిన లకావత్ భద్రు, రేపల్లెవాడకు చెందిన భూక్యా వనిత టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తూ ఇటీవల మృతిచెందారు. దీంతో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరైంది. దీంతో ఆ చెక్కులను సోమవారం బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని అన్నారు. సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా లాలునాయక్, టీఆర్ఎస్ నేతలు బానోత్ సురేశ్నాయక్, మేడా ధర్మారావు, పూర్ణకంటి మైసారావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, భూక్యా చందులాల్, శోభన్నాయక్, ఇసనపల్లి నాగేశ్వరరావు, బానోత్ రామారావు, హరికృష్ణ, అంజన్కుమార్ పాల్గొన్నారు.