న్యూఢిల్లీ: రాజస్థాన్కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అన్సూ, రీతూ, సుమన్.. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఆఫీసర్ ఉద్యోగం సంపాదించారు. ఆ ముగ్గురితో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా ఆఫీసర్లు అయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్లో తెలిపారు. ఆ సిస్టర్స్ ఫోటో షేర్ చేసిన ఆయన వారికి కంగ్రాట్స్ తెలిపారు. కుటుంబానికి చెందిన అయిదురుగు అక్కాచెల్లెళ్లు ఒకే సర్వీస్ ఎగ్జామ్ను క్లియర్ చేయడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే రోమా, మంజూలు .. ఆర్ఏఎస్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
హనుమాన్ఘర్ జిల్లాలోని బైరుసరి గ్రామంలో సంబరాలు మొదలయ్యాయి. ఆ అయిదుగరు అమ్మాయిల తండ్రి సహదేవ్ శరన్ ఓ రైతు. ఆయన 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఇక ఆ అమ్మాయి తల్లి లక్ష్మీ నిరక్ష్యరాసురాలు. తమ సక్సెస్కు పేరెంట్స్ కారణమని అక్కాచెల్లెళ్లు చెప్పారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఆర్ఏఎస్ 2018 పరీక్ష ఫలితాలను తాజాగా రిలీజ్ చేశారు. ఆ పరీక్షల్లో జుంజునూ ముక్తా రావు తొలి ర్యాంక్ సాధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పిల్లితో చిలుక చెలగాటం.. చివరికి ఏమైందో చూడండి..!
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
Pet Passport : శునకాలకూ పాస్పోర్టు ఉంటుందని తెలుసా !