అదిలాబాద్ : జిల్లాలో రెండో దశలో కొవిడ్ ప్రబలకుండా నియంత్రణ, నివారణ చర్యలు పటిష్టవంతంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో కరోనా నియంత్రణకు జిల్లాలో అమలు చేస్తున్న పటిష్ట చర్యలు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, హాస్పిటల్ మేనేజ్మెంట్, పేషంట్లకు వైద్య చికిత్సలు, కంటైన్మెంట్ జోన్స్, తదితర అంశాలపై ప్రజాప్రతినిదులు, జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా వ్యాప్తి తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గిందన్నారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ లో ఎలాంటి ఆంక్షలు లేవని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక దేశంలో డెత్ రేట్ తక్కువగా ఉందన్నారు. అపోహలను వీడి ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎమ్మార్పీ ధరలకే రెమ్డిసివిర్ ఇంజక్షన్లు విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పొరుగు రాష్ట్రాల పేషంట్లు హైదరాబాద్ తో పాటు సరిహద్దుల్లో ఉన్న జిల్లా కేంద్రాల హాస్పిటల్స్ కు రావడంతో మన దగ్గర కొంత వరకు బెడ్స్ దొరకని పరిస్థితి ఉందని, అందుకే జిల్లా కేంద్రాల్లో నిఘాను మరింత పెంచాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి పరీక్షలు చేయండి
గంగానది ఇసుకతిన్నెల్లో బయటపడ్డ శవాలు