శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని చిమ్మర్ గ్రామంలో భద్రతా దళాలు బుధవారం ఉదయం కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా ఒక ఉగ్రవాది లొంగిపోయినట్లు సమాచారం. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.