రాష్ట్రంలోనే జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దే
నిజామాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. జగిత్యాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల, జూన్ 1(నమస్తే తెలంగాణ): జగిత్యాలకు త్వరలోనే సూపర్ హాస్పిటల్కు కూడా మంజూరవుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, దాన్ని సాకారం చేశారని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వినతి మేరకు త్వరలోనే జగిత్యాలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సైతం మంజూరవుతుందని ఆమె పేర్కొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూకపెల్లి వద్ద కేసీఆర్ నగర్లో నిర్మిస్తున్న 4,520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, సుంకె రవిశంకర్తో కలిసి ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా కావాలన్న జగిత్యాల ప్రజల చిరకాల కోరికను సీఎం కేసీఆర్ నేరవేర్చారన్నారు. జిల్లాగా అవతరించిన తర్వాత మౌలిక వసతులను కల్పించి, ఇతర జిల్లాలకు దీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పం తో కృషి చేశామన్నారు. జగిత్యాలలో నిరుపేదలు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే ఆయన రాష్ట్రంలో ఏ జిల్లాకు ఇవ్వని విధంగా ఒకే చోట 4520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేశారన్నారు.
రూ.212 కోట్లకు పైగా నిధులతో ఇండ్ల నిర్మాణం వేగం గా సాగుతున్నదన్నారు. ప్రతి నిరుపేద గౌరవ ప్రదమైన జీవితం గడపాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, అందులోభాగంగానే డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కాలేజీని సైతం మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరుకు కృషి చేస్తానన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నా, జగిత్యాల జిల్లా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ఇక్కడి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. కలెక్టర్ గుగులోత్ రవి, హౌసింగ్ అధికారులు, నిర్మాణ బాధ్యతలు చూస్తున్న సంస్థల ఇంజినీర్లతో పనుల ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ, కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో జగిత్యాల ప్రాంత ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేయాలని కోరగా సీఎం కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లి మంజూరు చేయించారన్నారు.
రాష్ట్రం లో ఏ మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వనన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సీఎం కేసీఆర్ జగిత్యాలకు మంజూరు చేశారన్నా రు. మంత్రులు కేటీఆర్, దయాకర్రావు ఆదేశాల నేపథ్యంలో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ ఈఎన్సీలు కాలనీని పరిశీలించి, ఓహెచ్ఆర్లు, ప్రత్యే క పైప్లైన్ నిర్మాణాలకు రూ.7కోట్లు మంజూ రు చేశారని, పనులన్నీ పూర్తయ్యాయన్నారు. ఇక నుంచి ఈ కాలనీ కేసీఆర్ నగర్గా పిలువబడుతుందన్నారు. అం తకుముందు ఎమెల్సీ కవితకు ఎమ్మెల్యేల తోపాటు, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, జడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్రావు స్వాగతం పలికారు. కలెక్టర్ జీ రవి, ఆర్డీవో మాధురి, మల్యా ల ఎంపీపీ మిట్టపెల్లి సుదర్శన్, జడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, జగిత్యాల రూరల్ ఎంపీపీ రాజేం ద్ర ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, గట్టు సతీశ్, సమిండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బాల్క సుమన్కు ఎమ్మెల్సీ పరామర్శ
మెట్పల్లి, జూన్ 1: పితృ వియోగం తో విషాదంలో ఉన్న విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఎమ్మెల్సీ కవిత మెట్పల్లి పట్టణ అనుబంధ గ్రామం రేగుంటలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాల్క సురేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుమన్తోపాటు ఆయ న తల్లి ముత్తమ్మను ఓదార్చి సానుభూ తి తెలియజేశారు. ఇక్కడ జడ్పీ చైర్ పర్సన్ వసంత, నాయకులు ఉన్నారు.