యాదాద్రి, మే 5: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యాదగిరిగుట్ట పట్టణంలో పురపాలక సంఘం కార్యవర్గం, వ్యాపారులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు స్వచ్ఛంద పాక్షిక లాక్డౌన్ను ప్రకటించారు. పట్టణంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల అనంతరం వ్యాపారులు దుకాణాలను బంద్ చేశారు. ప్రతి బుధవారం పట్టణంలో నిర్వహించే వారాంతపు సంతను నిలిపివేశారు. అత్యవసరాలైన దవాఖానలు, మెడికల్ షాప్, పాలు, పండ్లు, కూరగాయలు, ని త్యావసర వస్తువులను లాక్డౌన్ నుంచి మినహాయింపును ఇచ్చినట్టు యా దగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్ తెలిపారు.