జూబ్లీహిల్స్,మార్చి25: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 51లో జలమండలి ఆధ్వర్యంలో 2018 సంవత్సరంలో రైన్ వాట ర్ హార్వెస్టింగ్ సిస్టంతో రూపొందించిన థీమ్ పార్కుకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. వర్షం నీరు వృథా కాకుం డా భూగర్భంలోకి చేర్చే ఈ థీమ్ పార్క్.. నేషనల్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్కు ఎంపికైంది. కేంద్ర జలశక్తి అభియాన్, నమామి గంగే సంయుక్తాధ్వర్యంలో ఎలెప్స్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ పరిశోధనలో జూబ్లీహిల్స్ థీమ్పార్కును ఈ అరుదైన అవార్డు వరించింది. నీటి సంరక్షణలో తెలంగాణకు దేశంలోనే రెండో వాటర్ హార్వెస్టింగ్ సిస్టంగా గుర్తింపు లభించింది. ఈనెల 18న అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ అవార్డును ప్రకటించారు. భూగర్భంలోని వివిధ పొరల్లో వర్షం నీరు సులువుగా ఇంకిపోయేలా 42 స్ట్రక్చర్స్తో దీనిని రూపొందించారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ జలం-జీవం అనే ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఏర్పాటు చేసిన థీమ్ పార్కుకు అవార్డు రావడంతో ఈ కార్యక్రమానికి ప్రతిఫలం దక్కినట్లు అయ్యింది.