హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఏర్పాటై 75 ఏండ్లు అయిన సందర్భంగా ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల లోగోను వర్సిటీ వీసీ ప్రవీణ్రావు సోమవారం ఆవిష్కరించారు. కరోనా కారణంగా ఆన్లైన్ వేదికగానే నిర్వహించాలని నిర్ణయించారు. లోగోను పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి ఎం విశాల్ తయారుచేశారు.