30 శాతం ఫిట్మెంట్తోపెద్ద మనసు చాటుకున్న సీఎం కేసీఆర్
ఉద్యోగవిరమణ వయస్సు 61 ఏండ్లకు పెంపు..
11వ వేతన సవరణ ఉత్తర్వులుఏప్రిల్ 1 నుంచి వర్తింపు
జిల్లాలో సంబురాలు చేసుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
యాదాద్రి భువనగిరి, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదినుంచీ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా అనేక నిర్ణయాలను అమలుచేస్తూ వస్తున్నది. సీఎం కేసీఆర్ పెద్ద మనసు తో ఉద్యోగుల హక్కులను గౌరవించేలా వేతనాలు పెంచి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. స్వరాష్ట్రంలో పాలన అమల్లోకి వచ్చిన కొద్దిరోజులకే స్పెషల్ ఇంక్రిమెంట్ను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ఉద్యోగులు పోషించిన పాత్రకు ప్రతిగా 2014లో పదోవేతన సవరణను చేపట్టి ఎవరూ ఊహించని రీతిలో 43శాతం ఫిట్మెంట్ను అమలు చేశారు. కొవిడ్ పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ 11వ వేతన సవరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడిం ది. పీఆర్సీపై ఏర్పాటైన బిశ్వాల్ కమిటీ ఉద్యోగులకు 7.5శాతం ఫిట్మెంట్ ఇస్తే చాలని సిఫార్సు చేసినప్పటికీ.. సీఎం కేసీఆర్ మాత్రం 30 శాతం ఫిట్మెంట్ను ప్రకటించి ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ.. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.. అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, హోంగార్డులు, కేజీవీబీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యో గులు, వీఆర్వో, వీఆర్ఏలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్డ్, డెయిలీ వెజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి.. జిల్లాలో 20 వేలకు పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ ఉత్తర్వులు ఈ ఏడాది ఏప్రిల్1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
వలిగొండ, మార్చి 22: ఉద్యోగులు, టీచర్లకు 30శాతం ఫిట్మెంట్తోపాటు ఉద్యోగవిరమణ వయస్సును 61 ఏండ్లను పెంపును హర్షిస్తూ వలిగొండ పీఆర్టీయూ ఉపాధ్యాయ సం ఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మండల కేం ద్రంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మండల అధ్యక్షుడు రవీందర్ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సోమ్లానాయక్, సత్యనారాయణ, యాదయ్య, విజయానంద్, అనీస్, మల్లేశం, మంజుల, రమేశ్ పాల్గొన్నారు.
బాణసంచా కాల్చిన పీఆర్టీయూ టీఎస్ నాయకులు
భువనగిరి టౌన్, మార్చి 22 : 30 శాతం ఫిట్మెంట్, పదోన్నతులు, పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంపు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర విద్యారంగ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్కు పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సత్తయ్య, రాములు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్కు ప్రకటనపై హర్షం వ్యక్తం
చేస్తూ సోమవారం పట్టణంలోని సంఘం కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.