న్యూఢిల్లీ: కోర్ట్ రూమ్.. వార్ జోన్ను తలపించింది. కాల్పుల మోతతో కోర్ట్హాల్ గజగజ వణికిపోయింది. న్యాయవాది దుస్తుల్లో వచ్చిన దుండగులు.. న్యాయమూర్తి ముందే సుమారు 25 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని రోహిణి కోర్టులో జరిగింది. తుపాకుల శబ్ధాలకు కోర్టుకు వచ్చినవారంతా భయంతో పరుగులు తీశారు. ఓ కేసులో జడ్జి ముందుకు గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని తీసుకువచ్చారు. అయితే అతని ప్రత్యర్థులు ఆ కోర్ట్హాల్కు మారువేషాల్లో వచ్చారు. అడ్వేకేట్ దుస్తుల్లో ఉన్న వాళ్లు .. జడ్జి ముందే గ్యాంగ్స్టర్ జితేందర్ను చంపేశారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ అప్రమత్తంగా ఉన్న పోలీసులు .. మారువేషాల్లో వచ్చిన ఇద్దర్ని కాల్చేశారు. కోర్టు రూమ్లో విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అడ్వకేట్ దుస్తుల్లో ఉన్న ఇద్దర్నీ పోలీసులు హతమార్చారు. సినీ ఫక్కీలో షూటౌట్ జరిగినట్లు ఉన్నా.. అది గ్యాంగ్వార్ కాదని ఢిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు. జితేందర్ను చంపేందుకు వచ్చిన వ్యక్తుల్లో ఒకరి తలపై నజరానా ఉన్నది. అతన్ని పట్టిస్తే 50 వేల రివార్డు ఉన్నట్లు రాకేశ్ ఆస్తానా తెలిపారు. మారువేషాల్లో వచ్చిన వారిని టిల్లు గ్యాంగ్ వ్యక్తులుగా గుర్తించారు.