ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. పంచభూతాలైన నింగి, నేల, నిప్పు, నీరు, గాలిని ప్రతిబింబించేలా ఈ జెర్సీ ఉంది. జట్టు సాధించిన ఐదు టైటిళ్లు.. పంచభూతాల ప్రాముఖ్యాన్ని తెలిపేలా దీన్ని రూపొందించినట్టు జట్టు యాజమాన్యం వెల్లడించింది.