జైపూర్ : రాజస్థాన్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్లోనే 16 మంది మృతి చెందగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు సీఎం అశోక్ గెహ్లాట్ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో పిడుగుపాటుకు 44 జంతువులు బలి అయ్యాయి. 42 మేకలు, ఒక ఆవు, ఎద్దు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ముగ్గురు రైతులు తమ పంట పొలాల వద్ద పిడుగుపాటుకు చనిపోయినట్లు తెలిపారు.