నారాయణపేట : జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు. ఎస్ఐ రవి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్సింలు గౌడ్ రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో సోమవారం మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి ఇంటిపై దాడులు నిర్వహించారు.
15 పల్లవి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు (500) గ్రా. మరో 15 లూజ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని మండల వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డికి అప్పగించారు. వీటి విలువ రూ.15,000 వేలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ