నారాయణఖేడ్, జూన్ 2 : నిరుపేద ఆడపడుచుల పాలిట కల్యాణలక్ష్మి పథకం వరంలా మారి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని జహీరాబాద్ ఎంపీ బీ.బీ. పాటిల్ అన్నారు. బుధవారం నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి కల్యాణక్ష్మి చెక్కులు అందజేసి ఎంపీ మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పేద ప్రజల అవసరాలను గుర్తించి, వారిని ఆదుకునే దిశగా పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దొడ్ల నర్సమ్మ, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, నాయకులు చంద్రశేఖర్రావు, దొడ్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటంబానికి పరామర్శ
వెంకటాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన తుమ్మల లక్ష్మయ్య కుటుంబాన్ని ఎంపీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పరామర్శించారు. తల్లి తులశమ్మను ఓదార్చి ధైర్యం చెప్పారు. అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.