బ్రిటన్ ప్రయాణికుల్లో 22 మందికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన ప్రయాణికుల్లో 22 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 11 మంది, అమృత్సర్లో 8 మంది, కోల్కతాలో ఇద్దరు, చెన్నైలో ఒకరు పాజిటివ్గా తేలారు. బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన ప్రయాణికులందరికీ ఆయా విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల ఫలితాల కోసం ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే ఉన్నారు. వీరందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కొందరి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపారు. కొత్త రకం కరోనా వైరస్ తీవ్రత స్థాయిని తెలుసుకునేందుకు పరిశోధకులు యత్నిస్తున్నారు. గత నాలుగు వారాల్లో యూకే నుంచి వచ్చిన ప్రయాణికులను అధికారులు గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు యూకే నుంచి వచ్చే విమానాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక కర్ణాటకతో పాటు ముంబై నగరంలో నైట్ కర్ఫ్యూను విధించారు. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 23,950 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.01 కోట్లకు చేరింది.
తాజావార్తలు
- ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్