ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన 21 ఏండ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మయూర్ ఫర్టడేకు ఫేస్బుక్ భారీ నజరానా ప్రకటించింది. ఫేస్బుక్కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ఇన్స్టాగ్రాంలో ఒక ‘బగ్’ను (సాంకేతికలోపాన్ని) గుర్తించినందుకుగాను అతడికి రూ.22 లక్షల నగదు బహుమతి (30 వేల యూఎస్ డాలర్లు) అందించింది. ఇన్స్టాగ్రాంలో యూజర్లను ఫాలో కాకున్నా వారి పోస్టులు, స్టోరీలు, ఫోటోలు, రీల్స్ను చూసేవిధంగా ఉన్న బగ్ను ఈ ఏడాది ఏప్రిల్ 19న గుర్తించిన మయూర్, దాని గురించి ఫేస్బుక్కు తెలియజేశాడు.