లక్నో : కరోనా మహమ్మారి పిల్లల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బులెంద్షహర్లోని జ్యువెనైల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న 22 మంది బాల నేరస్తులు కరోనా బారినపడ్డారు. వీరిని అధికారులు కొవిడ్ దవాఖానకు తరలించి చికిత్స అందుతున్నారు. జ్యువెనైల్ హోంలో ఓ బాలుడు కొద్ది రోజుల క్రితం కొవిడ్ లక్షణాలతో మృతి చెందాడు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు.. హోంలోని చిన్నారులకు, సిబ్బంది అందరికీ మే 7న ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎవరికీ పాజిటివ్గా నిర్ధారణ కాకపోవడం ఊపిరిపీల్చుకున్నారు. వారంరోజుల తరువాత కొంతమంది చిన్నారుల ఆరోగ్యం క్షీణించడంతో వైద్య సిబ్బంది మరోసారి హోంలోని 75 మందికి పరీక్షలు నిర్వహించింది. 22 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వెంటనే వీరిని వీవీఐటీ కొవిడ్ దవాఖాన తరలించి చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.