మెడికల్ ఫలితాలు విడుదల
97 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్నగర్ మెడికల్ కళాశాల రికార్డు
ఫస్ట్ బ్యాచ్లో ముగ్గురికి డిస్టింక్షన్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ హర్షం
మహబూబ్నగర్, మే 30 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : ఎంబీబీఎస్ ఫలితా లు వెలువడకముందే వైద్య సేవలు అం దించేందుకు ముందుకొచ్చి స్ఫూర్తిగా నిలిచిన మహబూబ్నగర్ వైద్య కళాశాల మొ దటి బ్యాచ్ విజయవంతంగా తమ కోర్సు ను పూర్తి చేసుకున్నది. 97 శాతం ఉత్తీర్ణతతో వైద్య విద్యార్థులు రికార్డు సృష్టించా రు. పాలమూరులో తొలి మెడికల్ కళాశాలను 2016లో ప్రారంభించగా.. ఆదివా రం ఫైనల్ ఇయర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మొదటి బ్యాచ్కు సంబంధించి న 140 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 136 మంది ఉత్తీర్ణత పొంది 97 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ముగ్గురు డిస్టింక్షన్ సాధించగా, 41 మం ది ఫస్ట్ క్లాసు, 92 మంది సెకండ్ క్లాసు లో ఉత్తీర్ణత సాధించారు. 97 శాతం ఉత్తీర్ణత సాధించిన మహబూబ్నగర్ ప్రభు త్వ వైద్య కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థులకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావు అభినందన లు తెలియజేశారు. 97 శాతం ఉత్తీర్ణత సాధించడంపై ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ డా.పుట్ట శ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ దవాఖాన పర్యవేక్షకుడు డా.రాంకిష న్, విద్యార్థులు, తల్లిదండ్రులను హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొదటి బ్యాచ్ విద్యార్థులే అద్భుతంగా రాణించారని పుట్టా శ్రీ నివాస్ పేర్కొన్నారు. భవిష్యత్లో ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలల తర్వా త మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల అన్ని అంశాల్లో ముందుంటుందని విద్యార్థులు, అధ్యాపకులు అంటున్నారు. కొత్త మెడికల్ కళాశాల అయినప్పటికీ డైరెక్టర్ డా. పుట్టా శ్రీనివాస్, ఫ్యాకల్టీ అద్భుతాలు చేసిందని, తమ కోసం ఎంతో కష్టపడ్డారని విద్యార్థులు చెబుతున్నారు.