లక్నో: ఉత్తరప్రదేశ్లో ఏప్రిల్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందిలో 2,097 మంది కరోనాతో మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి 29 వరకు నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు, మే 2న ఓట్ల లెక్కింపు జరిగాయి. ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందిలో మొత్తం 2,128 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఇందులో 2,097 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతూ చనిపోగా, 31 మంది ఇతర కారణాల వల్ల మరణించినట్లు పంచాయతీరాజ్ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఆ రాష్ట్ర ఎన్నికల కార్యదర్శికి ఈ మేరకు సమాచారం పంపారు. మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.633.25 కోట్ల ఎక్స్గ్రేషియాను తర్వగా చెల్లించే ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా కోరారు.