న్యూఢిల్లీ: కర్ణాటకలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రోజూ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా కొత్తగా 20,378 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,87,827కు చేరింది. ఇదిలావుంటే ఆదివారం కొత్తగా 382 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 28,679కి చేరింది.
ఆదివారం కరోనా రికవరీలు కూడా 28,053 నమోదయ్యాయి. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 22,17,117కు పెరిగింది. ప్రస్తుతం 3,42,010 యాక్టివ్ కేసులు ఉన్నాయి.