న్యూఢిల్లీ: ఒక మహిళ నుంచి మొబైల్ ఫోన్ స్నాచింగ్ చేసిన మరో మహిళను సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు పట్టించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న ఒక మహిళను నిందితురాలు జ్యోతి వెనుక నుంచి దాడి చేసి ఆమె మొబైల్ ఫోన్ స్నాచింగ్ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరు మహిళల మధ్య కొంత పెనుగులాట జరిగింది. చివరకు జ్యోతి ఆ మహిళను పక్కకు తోసి కింద పడిన మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లగా బాధితురాలు ఆమె వెంట పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో ఇదంతా రికార్డైంది. దీంతో మంగోల్పురి ప్రాంతానికి చెందిన నిందితురాలు జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ సీసీటీసీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.