జహీరాబాద్, ఏప్రిల్ 15 : జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం పైపులైన్, నల్లాలు ఏర్పాటు చేస్తుందని 14వ వార్డు మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకుడు నామ రవికిరణ్ తెలిపారు. గురువారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులోని డ్రీమ్ వాలి కాలనీలో మిషన్ భగరీథ పనులు ప్రారంభించారు. కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి మంజీరా నీరు సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు యాకుబ్, టీఆర్ఎస్ ఇజ్రాయిల్ బాబీ, జహీర్, నరేశ్రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పాకిస్తాన్లో ఆందోళనలు.. ఏడుగురు మృతి
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి