ఎలిగేడు, ఏప్రిల్ 15: కేంద్రప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీన కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో సాయంత్రం 3 గంటలకు రైతు మహాగర్జన సభను నిర్వహించనున్నట్లు ఓసీ సామాజిక సం ఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గర్జన పోస్టర్లను రామారావు జిల్లా సమాఖ్య కన్వీనర్ బైరెడ్డి రాంరెడ్డి పలువురు నాయకులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్ల వయసు పైబడ్డ రైతులందరికీ నెలకు రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, రైతులు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నరినేని సుధాకర్రావు, సర్పంచులు మాడ కొండాల్రెడ్డి, బూర్ల సింధూజ, ఉప సర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వరరావు, తాటిపెల్లి రమేశ్బాబు, బూర్ల వెంకటసత్యం, చింతిరెడ్డి గణపతిరెడ్డి, నోముల మహేందర్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు చలందుల చంద్రశేఖర్యాదవ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఎఫ్3 షూట్లో అంజలి చేరేది ఎప్పుడంటే..?