రవితేజ కథానాయకుడిగా ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. ఉగాది సందర్భంగా మంగళవారం చిత్ర పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో రవితేజ క్లాప్ నివ్వగా, నిర్మాత రవిశంకర్ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి దర్శకుడు శరత్కు స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రమిది. వెంకటేష్, అజిత్, కమల్హాసన్ చిత్రాలకు రచయితగా పనిచేసిన శరత్ మండవ వినూత్నమైన పాయింట్తో కథను సిద్ధంచేశారు. రవితేజ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్.