మంత్రి పువ్వాడ అజయ్కుమార్
బాలప్పేట తండాలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి చేరిక
రఘునాథపాలెం, ఏప్రిల్ 14: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లి కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రి అజయ్కుమార్ అన్నారు. నగరంలోని 8వ డివిజన్ పరిధిలోని బాలప్పేటతండాలో కాంగ్రెస్ నాయకులు భుక్యా భాషా, అజ్మీరా భీక్యా ఆధ్వర్యంలో వంద కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. బాలప్పేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీ నాయకులు కొత్తవారిని కలుపుకొని పనిచేయాలన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో అజ్మీరా రాములు, అజ్మీరా వెంకన్న, బానోతు రమేశ్, బానోతు శ్రీను, ధరావత్ నాగులు, భుక్యా రాంచంద్రు, బానోత్ గోపి, భుక్యా శ్రీను తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మాజీ కార్పొరేటర్ కొణకంచి సరళ, నాయకులు కొణకంచి వరప్రసాద్, మందనపు నరేశ్, కాట్రాల శ్రీరాములు, అజ్మీరా వెంకన్న, వడ్త్యా వీరన్న, గాదె ఉపేందర్, ముళ్లంగి శ్రీనివాసరావు ఉన్నారు.
పాండురంగాపురం నుంచి ‘రజీం’ చేరిక
ఖమ్మం నగరం పాండురంగాపురానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకుడు షేక్ రజీం కూడా బుధవారం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 2వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నర్రా ఎల్లయ్య, కుర్రా మాధవరావు, యెచ్చు ప్రసాద్, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు.