‘పల్లెప్రగతి’తో మారిన రూపురేఖలు
నెలనెలా నిధులతో అభివృద్ధి పనులు
పాలకుల ప్రత్యేక శ్రద్ధతో తీరిన సమస్యలు
అందుబాటులోకి శ్మశానవాటిక, డంపింగ్ యార్డు
ఎల్కతుర్తి, ఏప్రిల్ 13:‘పల్లె ప్రగతి’తో ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ కొత్తరూపు సంతరించుకుంది. రాష్ట్ర సర్కారు సహకారానికి జీపీ పాలకుల ప్రత్యేక శ్రద్ధ, అధికారుల పర్యవేక్షణ తోడై గ్రామం అభివృద్ధి బాట పట్టింది. పంచాయతీకి నెలనెలా సమకూరుతున్న నిధులతో పాటు దాతల ప్రోత్సాహంతో ప్రజలకు సకల సౌకర్యాలు అందుబాటులో వచ్చాయి. ఫలితంగా వీధుల్లో పచ్చదనం, ఆహ్లాదం పంచేలా ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, ఎల్ఈడీ లైట్లతో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి.
పక్కా ప్రణాళికతో..
పల్లె ప్రగతిని పక్కాగా అమలుచేయడంతో పనులు నిర్ణీత సమయానికి ముందే పూర్తయ్యాయి. రూ.12.50లక్షలతో శ్మశానవాటిక, రూ. 2.50లక్షలతో డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనాలను పూర్తి చేశారు. హరితహారంలో భాగంగా సుమారు 5వేల మొక్కలు నాటగా ప్రస్తుతం నర్సరీలో 16వేల మొక్కలు పెంచుతున్నారు. సుమారు 25 విద్యుత్ స్తంభాలకు థర్డ్ వైరును అమర్చారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న ఆరు పాత ఇండ్లను కూల్చడంతో పాటు రెండు పాడు పడ్డ బావులను పూడ్చివేశారు. రూ.8లక్షలతో సీసీ రోడ్లు, రూ.7లక్షలతో మురికి కాల్వలను నిర్మించారు. 130 ఇంకుడు గుంతలను తవ్వించారు. పబ్లిక్ టాయ్లెట్ల నిర్మాణం కూడా పూర్తయింది. ప్రభుత్వం నుంచి గ్రామానికి ప్రతి నెలా గ్రామానికి రూ.2.50లక్షలు వస్తున్నాయి. ఈ నిధులతో వీధిలైట్లు, మురికి కాల్వల నిర్వహణ, ట్రాక్టర్ మెయింటనెన్స్, మొక్కల సంరక్షణ, ఇతరత్రా మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటోంది. గ్రామ పంచాయతీకి నలుగురు సిబ్బంది ఉండగా, వారికి నెలకు రూ.8500 చొప్పున జీతాలను చెల్లిస్తున్నారు. అలాగే రైతువేదిక కోసం ప్రభుత్వం రూ.22లక్షలు ఇవ్వగా, కావేరి సీడ్స్ అధినేత భాస్కర్రావు రూ.40 లక్షల వరకు విరాళమిచ్చారు. ఇలా సకల సదుపాయాలు, అభివృద్ధితో కోతులనడుమ ఆదర్శంగా నిలుస్తోంది.
ఆదర్శంగా తీర్చిదిద్దుతా
పల్లె ప్రగతితో గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. నెలనెలా జీపీకి వచ్చే ని ధులను సక్రమంగా వినియోగించుకుంటూ అన్ని సదుపాయాలు కల్పిస్తు న్నాం. శ్మశానవాటిక, ఇంకుడు గుంత లు, పల్లెప్రకృతి వనాల నిర్మాణాలు స మయం కంటే ముందే పూర్తయ్యాయి. అధికారులు, పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.
మరింత అభివృద్ధికి కృషి
పల్లెప్రగతి లక్ష్యాలను పూర్తి చేసేందుకు పై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అధికారుల సూచనలు, సలహాలతో పాటు పంచాయతీ పాలకవర్గం సహకారంతోనే లక్ష్యాలను చేరుకున్నాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం ఆధ్వర్యంతో ప్రణాళికలు రూపొందించాం. – లావణ్య, పంచాయతీ కార్యదర్శి
ఊరు బాగైంది..
ఇదివరకు నిధులు లేక ఊరిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండేవి. ఇప్పుడు పల్లె ప్రగతి ద్వారా నెలనెలా ప్రభుత్వం నుంచి నిధులు రావడం వల్ల ఊరి ఎంతో బాగుపడింది. చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. వాడవాడలా మొక్కలు నాటడం, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనాలు బాగున్నాయి. రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్నారు.
– తిరుపతి, గ్రామస్తుడు
ఇవి కూడా చదవండి
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా