హైదరాబాద్ : కరోనా మహమ్మారి వేళ మంగళవారం ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిరాడంబరంగా జరుగనున్నాయి. హైదరాబాద్ బొగ్గులకుంటలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. దేవాయదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అతిథిగా, ప్రభుత్వ సలహాదారు రమణాచారి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఉదయం 10.45 గంటల నుంచి ప్రముఖ పండితులు బాచంపల్లి సంతోష్కుమార్ ప్లవనామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయనున్నారు.