పటాన్చెరు, ఏప్రిల్ 10: సీఎం రిలీఫ్ఫండ్తో ప్రజారోగ్యానికి భరోసా లభిస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరులోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ఫండ్స్కోసం దరఖాస్తు చేసుకున్న 27మంది లబ్ధిదారులకు రూ.12లక్షల 4వేల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ఫండ్స్ శస్త్ర చికిత్సలకోసం వేచి చూస్తున్నవారికి వరంలా మారాయన్నారు. నియోజకవర్గంలో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ఫండ్ మంజూరవుతున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్పనగేశ్, టీఆర్ఎస్ నాయకులు వరప్రసాద్రెడ్డి, దశరథరెడ్డి, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి భరోసా
ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయం లో బొల్లారం మున్సిపాలిటీ బీరప్పబస్తీకి చెందిన నారాయణమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.30వేలు, వినాయక్నగర్కు చెందిన బాలునాయక్కు రూ.60వేల చెక్కులు మంజూరయ్యాయి. మున్సిపల్ టీఆర్ఎస్ నాయకులు, 17వ వార్డు కౌన్సిలర్ హన్మంత్రెడ్డి, జిల్లా టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు వరప్రసాద్రెడ్డి సమక్షంలో ఎమ్మెలే జీఎంఆర్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు.
గ్రామాల అభివృద్ధి వేగం
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం లక్ష్మీపతిగూడెం పంచాయతీ చౌదరిగూడెంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల అభివృద్ధికి దృష్టి సారించామన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలందరూ కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్లు జనార్దన్, శివరాజ్, ఆంజనేయులు, చిట్ల సత్యనారాయణ, నాయకులు ఉన్నారు.
రైతు కుటుంబానికి పరిహారం అందజేత
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పరిహారం అందజేశారు. ఊట్ల గ్రామానికి చెందిన రైతు పూజారి వీరేశం కొన్ని రోజుల కిం దట పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందించారు. శనివారం పటాన్చెరులోని తన క్యాంప్ ఆఫీసులో మృతి చెందిన రైతు భార్య లక్ష్మికి రూ.5లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరాజ్, కొడకంచి సర్పంచ్ శివ, నాయకులు కృష్ణ, మహేశ్, కృష్ణ, భిక్షపతి పాల్గొన్నారు.
కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
లక్ష్మీపతిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జీతయ్య ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మృతుడి కుటుంబానికి శనివారం రూ.50వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ లావణ్య జీవన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఉన్నారు.
భద్రతకు పెద్దపీట…
రాష్ట్రప్రభుత్వం భద్రత, ప్రజా రక్షణకు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల, ఈదులనాగులపల్లిల్లో రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం సంతోషకరమన్నారు. ఇటీవల నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, జీహెచ్ఎం సీ డివిజన్లు, గ్రామాల్లో సీసీ కెమెరాల వినియోగం పెరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు రవీందర్రెడ్డి, సుచరిత కొమురయ్య, డీఎస్పీ భీమ్రెడ్డి, సీఐ రాంరెడ్డి ఉన్నారు.