కొవిడ్ నిబంధనలకు లోబడే రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయని, జోన్ పరిధిలోని ఏ స్టేషన్లోనూ భారీ సమూహం లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య స్పష్టం చేశారు. శుక్రవారం రైల్ నిలయం నుంచి వర్చువల్ మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ప్రయాణించే విధం గా దక్షిణ మధ్య రైల్వే అన్ని జాగ్రత్తలు తీసుందని, దీనికి సంబంధించి కొన్ని మీడియాల ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని, వాటిని నమ్మవద్దని అన్నారు.