అంకిత భావంతో పని చేయాలని సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పిలుపు
వరంగల్ : త్వరలో జరగనున్న గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, పలువురు అధికారులు పరిశీలించారు. 66 డివిజన్లకు ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం హన్మకొండ, వరంగల్లో ఒక్కో సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మడికొండలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నిట్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వరంగల్ అబ్బనికుంటలోని ప్లాటినమ్ జూబ్లీ పాఠశాలలను పరిశీలించారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయం చేరుకుని సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఉప కమిషనర్, ఎన్నికల ప్రత్యేకాధికారి పంకజ, డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్, బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఆర్డీవో వాసుచంద్ర, టీపీవో శాంతికుమార్, రెవెన్యూ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం.. ఓపాడ్స్ను ప్రారంభించిన తెలంగాణ బాలిక
మార్కెట్లోకి కొత్త రోబో కుక్క.. ఎగబడి కొంటున్న జనం