నర్సంపేట, ఏప్రిల్ 5 : దళిత ఆణిముత్యం మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు జగ్జీవన్రామ్ అని అన్నారు. దళిత పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించడానికి ఎంతో కృషి చేశారన్నారు. దళిత కుటుంబంలో జన్మించి, నాయకుడిగా ఎదిగారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మండల శ్రీనివాస్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కల్లెపెల్లి సురేశ్, వేల్పుగొండ రాజు, సుకునే రాజేశ్వర్, కోట డేవిడ్, పంజాల రాజుగౌడ్, పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పెద్దికి సన్మానం..
నర్సంపేట రూరల్ : గురిజాల క్రాస్ రోడ్డు నుంచి లింగాపురం వరకు డబుల్రోడ్డు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురిజాల పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని గురిజాల, గుర్రాల గండిరాజపల్లి, చిన్న గురిజాల గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ది సుదర్శన్రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు గొడిశాల మమత, గడ్డం సుజాత, తుత్తూరు కోమల, ఎంపీటీసీ బండారు శ్రీలత, క్లస్టర్ ఇన్చార్జి మోటూరి రవి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, గ్రామ అధ్యక్షుడు దూడెల ప్రకాశ్, రైతు బంధు సమితి కన్వీనర్ అన్న కోమల-రాజమల్లు, మాజీ ఎంపీటీసీ గడ్డం కొంరయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రి కుమారస్వామి, నాయకులు చిన్నపల్లి నర్సింహం, నామాల వంశీ, కత్తుల కుమారస్వామి, వెంకటేశ్వర్లు, బండారి మల్లయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తృణమూల్కు మద్దతుగా జయా బచ్చన్ ప్రచారం
మంత్రి అనుచరుని ఇంట్లో భారీగా నగదు పట్టివేత