అడుగంటుతున్న నిజాంసాగర్కు కొండపోచమ్మ ఊపిరి
ఉమ్మడి నిజామాబాద్ వ్యవసాయానికి జవసత్వాలు
రోహిణి కార్తెలోనే నారుమడులు వేసుకునే అవకాశం
స్వాతంత్య్రానికి పూర్వం నిజాంకాలంలోనే నీటికి అడ్డుకట్ట వేసిన ప్రాంతం. మంజీరపై చారిత్రక నిర్మాణంతో పంటల సాగుకు పెట్టింది పేరు. విద్యుత్తు అవసరం లేకుండానే దశాబ్దాలపాటు వ్యవసాయాన్ని పండుగలా సాగించిన నేల. రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆయువుపట్టు నిజాంసాగర్ ప్రాజెక్టు. ఏడు దశాబ్దాలపాటు రోహిణిలోనే నారుమళ్లు వేసుకొనేలా రైతులకు అండగా నిలిచిన ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా వట్టిపోతున్నది. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు చరిత్రలోనే నిలిచిపోయేలా నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ‘కొండ’ంత అండగా నిలువనున్నది.
నిజామాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంజీర పరివాహక ప్రాంతంలో నేటి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట శివారులో 1923-31 మధ్య నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణమైంది. 2.72 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో నిజాం నవాబు భారీ ప్రాజెక్టును నిర్మించారు. 155 కిలోమీటర్ల మేర 82 డిస్ట్రిబ్యూటరీ కాలువలతో ఆయకట్టుకు సాగునీరందింది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పుష్కలమైన వరద నీరు చేరడంతో ఈ ప్రాజెక్టు కింద ఏడు దశాబ్దాలపాటు సాగు పండుగలా సాగిం ది. 20 ఏండ్లుగా కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు, చెక్డ్యామ్లు నిర్మించడంతో నిజాంసాగర్లోకి ఇన్ఫ్లోలు నిలిచిపోయాయి. హైదరాబాద్కు తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు 1982 లో మంజీరపై సింగూరు ప్రాజెక్టు నిర్మాణంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రాజెక్టులో పూడిక కూడా చేరడంతో 29.20 టీఎంసీల సామర్థ్యం 14కు పడిపోయింది. ఆయకట్టు 1.60 లక్షల ఎకరాలకు దిగజారింది. పదేండ్లుగా అలీసాగర్ వరకు 80 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించే స్థితికి దిగజారింది.
నిజాంసాగర్లోకి గోదారమ్మ
కాళేశ్వరం పుణ్యమా అని ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా నిజాంసాగర్లోకి నీళ్లు చేరనున్నాయి. కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగులోకి నీటి విడుదల ద్వారా 96 కిలోమీటర్ల దూరంలోని నిజాంసాగర్ నిండనున్నది. ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంటే ఆయకట్టుకు పాత రోజులు వచ్చినట్టే. రోహిణిలో నారు పోసి సాగుకు రైతన్నలు నడుం బిగించడం ఖాయమే.
మరిన్ని వార్తలు చదవండి..
ఒక్క గ్రామానికి ఏడాదికి 3.37 కోట్లు
తపాస్పల్లికి మల్లన్నసాగర్ నీరు
మల్లన్నసాగర్ నుంచే నిజాంసాగర్కు