ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా సోకిన వారితో కిటకిటలాడుతున్నాయి. దీంతో పడకలు చాలక ఒక బెడ్పై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. నాగ్పూర్ జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. ఒక బెడ్పై ఒకరి కంటే ఎక్కువ మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.
కాగా, మహారాష్ట్ర నుంచే గాక పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా కరోనా రోగులు ఆసుపత్రిలో చేరుతున్నారనిమెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవినాష్ వి గవాండే తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని ఆయన వివరించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 57,074 కరోనా కేసులు, 222 మరణాలు నమోదయ్యాయి.