జహీరాబాద్, ఏప్రిల్ 2 : ఆకు పచ్చని గ్రామాలు చేసి, పర్యావరణ పరిక్షణ కోసం సీఎం కేసీఆర్ హరిత హారంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. వానలు కురువగానే మొక్కలు నాటేందుకు అటవీ, డీఆర్డీఏ అధికారులు నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారు. జహీరాబాద్ డివిజన్లోని జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల్లోని నర్సరీలో 169 గ్రామ పంచాయతీల్లో సుమారు 1.69 కోట్ల మొక్కలు పెంచుతున్నారు. వీటితో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో 10 నర్సరీలో 10.80 లక్షల మొక్కలను పెంచుతున్నారు. నర్సీలో మామిడి, జామా, సీతాఫలం వంటి వివిధ రకాల మొక్కలు కూడా పెంచుతున్నారు. నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బోర్లు ఉన్న చోట నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గ్రామ స్థాయిలో హరితహారం కమిటీలు ఏర్పాటు చేసి మొక్కలను పర్యవేక్షణ చేస్తున్నారు. గత ఏడాది నాటిన ప్రతి మొక్కనూ కాపాడేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గత ఏడాది కంటే అధికంగా మొక్కలు నాటేందుకు అధికారులు గ్రామ స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. హరితహారం పథకంను విజయవంతం చేసేందుకు మండల స్థాయిలో ఎంపీడీవోలు పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పర్యవేక్షణ చేసి మొక్కలు పెంచడం, నాటిన మొక్కలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు
హరితహరంలో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి 10.80 లక్షల మొక్కలను పెంచుతున్నాం. వీటితో పాటు డీఆర్డీఏ ద్వారా మొక్కల పెంపకం చేస్తున్నారు. పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. గత ఏడాది నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోగా, ఈ సారి సైతం మొక్కల పెంపకానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. అన్ని మండలాల్లో అటవీ శాఖ ద్వారా మొక్కలు పెంచి, రోడ్లు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-విజయ్రాణి,జహీరాబాద్ సబ్ డివిజన్ అటవీ శాఖ అధికారి
ఇవీ కూడా చదవండి
ఆడపిల్ల పుట్టిందని సంకేతమిస్తూ.. నీటిలో కూలిన విమానం
రైలు ప్రమాదం.. 48కి చేరిన మృతుల సంఖ్య
ఆస్ట్రాజెనికాతో బ్లడ్ క్లాటింగ్.. కొత్తగా 25 కేసులు నమోదు
రిపోర్టర్లను ఏప్రిల్ ఫూల్ చేసిన జిల్ బైడెన్
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్