మహబూబాబాద్: సీఎం కేసీఆర్ సహకారంతో అనుకున్నదానికంటే ఎక్కువగానే డోర్నకల్ అభివృద్ధి చెందిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎన్నడూలేనివిధంగా డోర్నకల్ ప్రాంతంలో చెరువులు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. మంత్రి ఇవాళ కురవి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని గిరిజన యువతకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. బ్యాంకర్లతో సంబంధం లేకుండా ఆర్థిక సహకార పథకాలను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మరింత ధృడంగా ఉండాలని, సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందించేలా ఆయనను దీవించాలని కురవి వీరభద్ర స్వామిని కోరుకున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే కురవి వీరభద్రునికి బంగారు మీసాలు, భద్రకాళి అమ్మవారికి ముక్కు పుడక సమర్పించి సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు నిధులు ఇచ్చారని వెల్లడించారు. నాలుగేండ్లు గడిచినప్పటికీ పనులు జరుగుతున్నాయని, వాటిని వీలైనంత తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..