యాదాద్రి, ఏప్రిల్ 1 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామి అమ్మవార్లకు వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులకు ఎలాంటి అనుమతి ఇవ్వకుండా ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం తంతులను నిరాడంబరంగా జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకుండా ఆలయ అర్చకులు స్వామివారి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ముందస్తు చర్యల్లో బాలాలయంతోపాటు క్యూలైన్లు, పురవీధుల్లో ఆలయ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
స్వామివారి ఖజానాకు రూ.1,81,594 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ.1,81,594 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.6,800, రూ.100 దర్శనాలతో రూ.4,500, ప్రచారశాఖ ద్వారా రూ.1,100, వ్రతాలతో రూ.8,000, కల్యాణకట్టతో రూ.7,200, ప్రసాద విక్రయాలతో రూ.1,21,440, వాహన పూజలతో రూ.1,400, టోల్గేట్ ద్వారా రూ.420, అన్నదాన విరాళంతో రూ.6,634, యాదరుషి నిలయంతో రూ.21,900, పాతగుట్టతో రూ.2,200తో కలిపి స్వామివారికి రూ.1,81,594 ఆదాయం సమకూరింది.
ఇవీ కూడా చదవండీ..
మరింత తీవ్రంగా కరోనా.. మాస్కులు ఉండాల్సిందే
ఢిల్లీ దవాఖానలో వైద్య అద్భుతం.. 30 ఏండ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ
మాస్క్ సరిగా పెట్టుకోకుంటే.. విమానాశ్రయాల్లో భారీ జరిమానా