హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): విజయవాడ దుర్గగుడిలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్ల అవకతవకలపై అందిన ఫిర్యాదులకు సంబంధించి ఇంద్రకీలాద్రిపై జెమ్మిదొడ్డి కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ ఈవో నుంచి వివరాలు సేకరిస్తున్నారు. స్టోర్స్ చీరల విభాగం, అన్నదాన విభాగంలో దస్ర్తాలను పరిశీలిస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ దాడుల్లో ఇప్పటికే 15 మంది అధికారులు సస్పెండైన విషయం తెలిసిందే.