విజయ డెయిరీకి పాలు పోసి లాభాలు పొందాలి
పాల సేకరణ 50 వేల లీటర్లకు పెరగాలిమంత్రి ఐకే రెడ్డి
ఆదిలాబాద్లో విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్, మార్చి 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతలు సాగుతోపాటు పాడి పరిశ్రమ ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి పొందాలని, విజయ డెయిరీకి పాలు విక్రయించి లాభాలు గడించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళ వారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని విజయ డెయిరీలో ఆధునీకరించిన పాలశీతలీకరణ కేంద్రాన్ని డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ప్రారంభించారు. లోక భూమారెడ్డి డెయిరీ అభివృద్ధికి చేసిన కృషిని సీఎం కేసీఆర్ ప్రశంసిం చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి పొందాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. ఆదిలాబాద్లో విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన 20 వేల లీటర్ల సామర్థ్యం గల పాలశీతలీకరణ కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. రైతులు బర్రెలు, ఆవులను పెంచుకునేలా అధికారులు చేయూతనందించాలని కోరారు. పాడి రైతులకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నదని తెలిపారు. లీటర్కు రూ.4 ఇన్సెంటివ్, దాణాకు రూ.300 సబ్సిడీ, రూ.1000 బీమా డబ్బులు చెల్లిస్తున్నదని వివరించారు. రైతులు విజయ డెయిరీకి పాలను విక్రయించి లాభాలు పొందాలని సూచించారు.
పాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు పాడి పశువులను పెంచాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి నాలుగేండ్లలోనే లాభాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. విజయ డెయిరీ అభివృద్ధికి లోక భూమారెడ్డి చేసిన కృషిని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో విజయ డెయిరీ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.18 కోట్లు కేటాయించారని, వీటితో నిర్మల్, లక్షెట్టిపేట, ఆదిలాబాద్లో పాలశీతలీకరణ కేంద్రాలను ఆధునీకరించినట్లు తెలిపారు. రోజుకు 50 వేల లీటర్ల పాల సేకరణ దిశగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. విజయ డెయిరీకి పాలను అమ్మితే కలిగే లాభాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులకు వివరిస్తే పాల సేకరణ పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాల సేకరణ పెంచేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 వేల మంది రైతులకు బర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అర్హులందరూ రైతులకు సైతం బర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డెయిరీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి గుస్సాడీ, మథుర నృత్య కళాకారులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, పశు సంవర్ధక, మత్య్సశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాజేంద్ర, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, మాజీ ఎంపీ జీ నగేశ్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం