మంచిర్యాల ఏసీసీ, మార్చి 29: మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో సోమవారం కోటి కుంకుమార్చన నిర్వహించారు. వేదపండితులు రాంబట్ల కార్తిక్ శర్మ, వేదం వెంకటరమణ శర్మ, దేవాలయ అర్చకులు సంగనబట్ల నరహరి శర్మ, వామనబట్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిపించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 33 రోజుల పాటు ఎవరి ఇంట్లో వారే కోటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించు కోవాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి ముక్త రవి సూచించారు.
ఇవి కూడా చదవండి
అమెరికన్ నేవీ అధికారుల నోట షారుక్ స్వదేశ్ పాట.. వీడియో
వ్యాక్సిన్ తీసుకున్న పుతిన్కు సైడ్ ఎఫెక్ట్స్