అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు.