ఏడు పదుల వయస్సులోనూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగు
సేంద్రియ ఎరువులతో పంటలు
సమాజ సేవలోనూ స్ఫూర్తిదాయకం
ఆదర్శం అరుణ కృషి
పినపాక, మార్చి 26: ఏడుపదుల వయస్సులోనూ ఆమె సాగులో దూసుకెళ్తున్నారు. వ్యవసాయం రంగాల్లో అనేక మార్పులు వచ్చినా సేంద్రియ ఎరువులతో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఎకరా పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేసి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఏడూళ్లబయ్యారం పిచుకలగుంపునకు చెందిన మహిళా రైతు భాగం అరుణ.
సాగు.. సామాజిక సేవ
సాగు, సామాజిక సేవలో అరుణ తనదైన ముద్ర వేస్తున్నారు. తోటకూర, కొత్తిమీర, చుక్కకూర, పాలకూర, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కీరదోస, చిక్కుడు, టమాటా, మిర్చి, మునగ, బత్తాయి, నారింజ, సపోట, బొప్పాయి, దానిమ్మ, నిమ్మ, మామిడి తదితర పండ్ల తోటలను సేంద్రియ ఎరువుతో సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. అంతేకాదు, ఆమె సమాజసేవలోనూ ముందున్నారు. గ్రామంలోని నిరాశ్రయులైన మహిళలకు అండగా నిలుస్తున్నారు. వారికి సేంద్రియ ఎరువుల తయారీలో మెళకువలు నేర్పించి ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారికి రాత్రిపూట అక్షరాలు నేర్పిస్తుంది. పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నది. శ్రమదానంతో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగింపజేస్తున్నది. మరుగుదొడ్ల వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నది. తన సొంత ఖర్చుతో రెండు కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వడం విశేషం. హరితహారంలోనూ చురుగ్గా పాల్గొని మొక్కలు నాటారామె. మొక్కలు మానవ మనుగడకు ఉయోగపడతాయని, పర్యావరణాన్ని కాపాడతాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని హరితహారంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు అరుణ.
ఇవి కూడా చదవండి..
రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!