గాజులరామారం, మార్చి 27 : ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్రాజు అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట చివరి బస్టాప్లో రూ.70 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నిధులకు కొరత లేకుండా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, వార్డు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.