మానవపాడు, మార్చి 27: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ధరణి వెబ్సైట్ అత్యద్భుతమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చండూరులో పదెకరాల పొలాన్ని కొన్న మం త్రి.. శనివారం మానవపాడు తాసిల్ కార్యాలయంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కార్యాలయానికి సాధారణ వ్యక్తి లా వచ్చిన ఆయన 7 నిమిషాల్లోనే ధరణిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియడంతో సంతోషం వ్యక్తంచేశారు. ధరణి సేవలు బాగున్నట్టు కితాబిచ్చారు.