అగర్తల: ఒక వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ త్రిపురలోని నూతన్బజార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర్తలు ఎన్నికల ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణించిన మినీ లారీపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అది రోడ్డుకు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.