వెల్దుర్తి, మార్చి 25. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్తో ఎలాంటి సమస్యలు లేవని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం వెల్దుర్తి ప్రభుత్వ దవాఖానను ఆయన సందర్శించి, కొవిడ్ వ్యాక్సినేషన్, పరీక్షల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ కొవిడ్-19 వచ్చిన నాటి నుంచి జిల్లాలో 98వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా, 4038 మందికి పాజిటీవ్ వచ్చిందని, 35 మంది మృతి చెందారన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ను జిల్లాలోని 16 కేంద్రాల్లో ఇస్తున్నామని , ఇప్పటి వరకు 16 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ఎలాంటి సమస్యలు రావని, అతి తక్కువ మందికి జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు వచ్చే అవకాశం ఉందన్నారు. 45 ఏళ్లు నిండినవారు ఈ వ్యాక్సిన్ను తీసుకోవచ్చని, ఏదేనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి ఆధార్ నంబర్తో నమోదు చేసుకొని తీసుకోవచ్చని అన్నారు. డీఎంహెచ్వోగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావును డీడీవో నవీన్కుమార్, ఎంపీహెచ్వో ప్రదీప్, మల్లికార్జున్లతో పాటు సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, సిబ్బంది శా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాప్రతినిధులకు కరోనా వ్యాక్సినేషన్
కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ సర్కార్ ఎంతో కృషిచేస్తుందని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని ప్ర జా ప్రతినిధులు, పలువురు అధికారులకు కొవిడ్ వ్యాక్సినేన్ వేశారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు,నాయకులు పాల్గొన్నారు.
చేగుంటలో 235 మందికి వ్యాక్సిన్
చేగుంట, మార్చి 25: చేగుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మూ డు రోజులుగా మొదటి డోస్గా 235మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు చేగుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం డాక్టర్ వినయ్కుమార్ తెలిపారు. గురువారం ఒక్క రోజున 45 సంవత్సరాలు దాటిన ప్రజా ప్రతినిధులకు, జర్నలిస్టులతో పాటు వంద మందికి వ్యాక్సిన్ వేసినట్లు వారు తెలిపారు. తీసుకున్న వారిని ఆరగంట సేపు సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నట్లు వినయ్కుమార్ తెలిపారు.