అమరావతి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్లో మంగళవారం అర్ధరాతి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని కాన్పూర్కు చెందిన వివేక్కుమార్, అభిషేక్, సుశీల్కుమార్, ప్రేమ్సంఘట్, అసోం రాష్ట్రానికి చెందిన ముస్తక్అలీ సత్తెనపల్లిలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి గుంటూరు నుంచి ఆటోలో స్పిన్నింగ్ మిల్లుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఐదులాంతర్ల కూడలిలో రోడ్డుపై ఆగి ఉండడంతో ఆటో నెమ్మదిగా వెళ్తుండడంతో.. వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆటో ముందున్న ట్రాక్టర్ తగిలి నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలంలోనే ఆటో డ్రైవర్తోపాటు అసోంకు చెందిన ముస్తక్అలీ అనే వ్యక్తి మృతి చెందారు. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.