హైదరాబాద్ : పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. పోలీస్శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలకు సంబంధించిన కార్యక్రమాలు అతి తక్కువ ధరలకే నిర్వహించుకునేలా.. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రభు త్వం అనుమతించింది. భవన నిర్మాణాల్లో భాగంగా యూసుఫ్గూడలోని టీఎస్ఎస్పీ మొద టి బెటాలియన్లో నిర్మించబోతున్న కమ్యూనిటీ హాల్కు శనివారం డీజీపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో శుభకార్యాలను నామమాత్రపు ధరలతో నిర్వహించుకునే వీలు కల్గుతుందన్నారు. వీటితోపాటు పోలీసులకు వెల్ఫేర్ లోన్లు ఇస్తున్నట్టు డీజీపీ తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ అభిలాషబిస్త్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.